top of page

ఆసుపత్రి నుంచి రవితేజ డిశ్చార్జ్..



ఇటీవలే మిస్టర్ బచ్చన్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు రవితేజ. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తన కొత్త ప్రాజెక్టు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మాస్ మాహారాజా. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన షూటింగ్ లో స్వల్పంగా గాయపడ్డారు. ఆ గాయాన్ని కూడా లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది కాస్త మరింత తీవ్రమైంది. దీంతో శుక్రవారం ఆయన ఆసుపత్రిలో చేరగా.. శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కుడి చేతికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ #Rtu75 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే గురువారం ఆయనకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్. కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.



Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page