top of page
Suresh D

కొత్త దంపతులకు అయోధ్య రామ మందిరం నుంచి స్పెషల్‌ సర్ ప్రైజ్.. రకుల్, జాకీల కోసం..✨👩‍❤️‍👨

తాజాగా ఈ కొత్త దంపతులకు అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం అందింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘మా వివాహం తర్వాత అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం.


టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. సుమారు మూడేళ్లుగా ఉన్న ఈ ప్రేమ పక్షులు ఫిబ్రవరి 21న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గోవా వేదికగా జరిగిన రకుల్ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇటీవలే అత్తారింట్లోకి అడుగుపెట్టిన రకుల్ సంప్రదాయ ప్రకారం తన మెట్టినింటి వారికి స్వయంగా హల్వా తయారు చేసి రుచి చూపించింది. తాజాగా ఈ కొత్త దంపతులకు అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం అందింది. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘మా వివాహం తర్వాత అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. నిజంగా మా జీవిత ప్రయాణంలో ఇదొక దివ్యమైన ప్రారంభం’ అంటూ అయోధ్య రామ మందిరం నుంచి అందిన ప్రసాదాల ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది రకుల్‌.

ఇదిలా ఏంటూ రకుల్‌ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ హనీమూన్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తోన్న బడే మియా చోటే మియా మూవీ రిలీజ్ తర్వాతే హనీమూన్ కు వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను జాకీ భగ్నానీనే నిర్మించడం విశేషం. ఈ ఏడాది రంజాన్ పండగ సందర్భంగా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ కానుంది. ఆ తర్వాతే రకుల్, జాకీ హనీమూన్ కు ప్లాన్ చేసినట్లు సమచారం. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బబాలీవుడ్‌ లో ‘మేరీ పత్నీ కా’ రీమేక్‌లో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.✨👩‍❤️‍👨


Comments


bottom of page