ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది.
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆతర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ వయ్యారి భామ.
ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భారీగా జరిగింది.
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ పెళ్ళైనా కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది.