top of page
MediaFx

ఊహించని నష్టం రకుల్ భర్త ఆస్తులు అమ్ముకుంటున్నాడు

😮 స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టారు. హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత అయిన జాకీ భగ్నానితో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ జీవితం సెటిల్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా జాకీ భగ్నానీ కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. 250 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాడు జాకీ భగ్నాని. దీంతో జాకీ భగ్నానీ తన ఆస్తులను అమ్ముకుంటున్నాడని తెలుస్తోంది.

జాకీ భగ్నానీకి ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ సంస్థ నిర్మించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాది తెరకెక్కిన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో కూడా ఈ సంస్థ పెట్టుబడి పెట్టింది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో నిర్మాత నష్టాల్లో మునిగిపోయారు.

జాకీ భగ్నానీ తన సంస్థలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు చాలా నెలలుగా జీతం చెల్లించలేదు. అతని మొత్తం అప్పు 250 కోట్ల రూపాయలకు చేరుకుంది. అందుకే ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ ఆఫీస్ ఉన్న భవనాన్ని అమ్మేశాడు. 7 అంతస్తులతో కూడిన భవనం అమ్మేశాడు జాకీ. భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో అపార్ట్ మెంట్ నిర్మిస్తారని అంటున్నారు. ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ భారీ నష్టాలను చవిచూడడంతో 80 శాతం మంది ఉద్యోగులను తొలగించారని తెలుస్తోంది. దాదాపుగా ఉద్యోగులెవ్వరికీ డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. దాంతో కొందరు ఈ సంస్థ, నిర్మాతలు జాకీ భగ్నాని, వాషు భగ్నానిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.


bottom of page