top of page

రాకేష్ మాస్టర్ ఇక లేరు.

ఇన్నిరోజులు సోషల్ మీడియాలో తన మాటలతో అందరిని ఎంటర్టైన్ చేసిన రాకేష్ మాస్టర్ ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ హాస్పిటల్ లో కన్నుమూశారు.

అకస్మాత్తుగా రక్త విరోచనాలు కావటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా , చికిత్స పొందుతూ అయన కన్నుమూశారు. మెటాబాలిక్ అసిడోసిస్ కారణంగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి (శరీరంలో ఆసిడ్ శాతం అమాంతం పెరిగి , అవయవాలు పనిచెయ్యకపోవటం )చనిపోయారు అని డాక్టర్లు వెల్లడించారు. రాకేష్ మాస్టర్ అయన రెండు కళ్ళను డొనేట్ చేశారు.

గతవారం ఒక ఈవెంట్ కోసం వైజాగ్ వెళ్లిన ఆయన స్నేహితులతో సరదాగా గడిపారు. తిరిగి వచ్చిన తరవాత కొంచం అస్వస్థతకు గురి అయ్యి , స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు ఆ తర్వాత ఆదివారం ఉదయం రక్తవిరోచనలు కావడంతో గాంధీలో అడ్మిట్ అయ్యారు . తిరుపతికి చెందిన రాకేష్ మాస్టర్ దాదాపు 1500 చిత్రాలకు కోరియోగ్రఫీ చేశారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియా లో మీమ్ (meme ) మెటీరియల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఒచ్చారు రాకేష్ మాస్టర్ .

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page