దీనికి డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి, అనుదీప్ గెస్టులుగా హాజరయ్యారు. "నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మమిత నాకు చాలా నచ్చింది.
'ప్రేమలు' సినిమాపై ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తోంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న రిలీజైన ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. దీనికి డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి, అనుదీప్ గెస్టులుగా హాజరయ్యారు. "నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మమిత నాకు చాలా నచ్చింది. భవిష్యత్తులో ఈ అమ్మాయే కుర్రాళ్ల క్రష్ అవుతుంది అనిపించింది. గీతాంజలిలో గిరిజ వచ్చినట్లు.. సాయి పల్లవి వచ్చినట్లు.. మమిత కూడా వస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో సచిన్ను చూసినప్పుడు.. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ చూస్తే డిప్ప మీద కొట్టాలనిపిస్తుంది. సరదాగా అన్నా కానీ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ మాత్రం 'ఆది'. అసలు ఈ క్యారెక్టర్ ఎంత చిరాకు తెప్పిస్తుందంటే పట్టుకొని కొట్టాలనిపిస్తుంది. మా డ్రైవర్ కూడా వచ్చేటప్పుడు తెగ తిట్టాడు.. సార్ సాఫ్ట్ వేర్ వాళ్లంతా అలానే ఉంటారు అన్నాడు. అందరూ అలా ఎందుకుంటారురా బాబూ అని వాదించాను. లేదు సార్ మా ఇంటికి పక్కన ఒక ఐటీ వాడు ఉండేవాడు సేమ్ ఆది లానే ఉంటాడంటూ మైకులో చెప్పలేనన్ని బూతులు తిట్టాడు." అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.🎥