top of page

ప్రధాని నరేంద్ర మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రేపు వరంగల్ జిల్లా (Warangal) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు 50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

కాజీపేటలోని 500 కోట్లతో గూడ్స్ రైలు వ్యాగన్ల తయారీ కార్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రం ఈ ఏర్పాటు చేయడం వల్ల దేశంలో వ్యాగన్ల తయారీ సామర్థ్యాన్ని మరింత ముందు తీసుకెళ్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఇందులో ఆధునిక యంత్రాలు ఏర్పాటుతోపాటు ఆధునిక రోబోటికీ యంత్రాలు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు.హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించబోయే ప్రధానమంత్రి సభకు పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పరిశీలించారు. సభా ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీ చేసి లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి కట్టడితో పోలీసులు కృషి చేస్తున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page