top of page
Shiva YT

👨‍💼 ప్రధాని మోదీ టూర్ ఫిక్స్..

🏛️ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది.. 17 సీట్లలో దాదాపు 10కి పైగా సీట్లే టార్గెట్‌గా ముందుగు దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీ.. 🗳️


ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రధాని సహా అగ్రనేతల పర్యటనతో ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. 📅 మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. 4న ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమాల్లో, 5న సంగారెడ్డి జిల్లా ప్రొగ్రామ్స్ లలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. 🚁 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారు. మార్చి 4న ఉదయం ప్రధాని మోడీ నాగ్ పూర్ ఎయిర్ పోర్ట్ నుంచి 9.20 కి హెలికాఫ్టర్ లో బయలుదేరుతారు. 10.20కి ఆదిలాబాద్ చేరుకొని.. 11 గంటల వరకు పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 11.15 నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్‌లో జరిగి బిజెపి భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి నాందేడ్ మీదుగా తమిళనాడు బయలుదేరి వేళ్తారు. తమిళనాడులో కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి 7.45 కి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి రాజ్ భవన్ లోనే ప్రధాని బస చేయనున్నారు.

Comments


bottom of page