top of page

🙏🕉️🕯️🇮🇳 జీ20 సమావేశంలో ప్రధాని మోడీ.. 🇮🇳📅👨‍💼

🇮🇳 భారతదేశం తన ప్రతిష్టాత్మకమైన విధానాల వైపు పయనిస్తుందని.. నిర్దేశించిన 2030 లక్ష్యానికి తొమ్మిదేళ్లు ముందుగా శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి దాని వ్యవస్థాపించిన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించిందని ప్రధాని మోడీ తెలిపారు. నేడు, వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పరంగా ప్రపంచంలోని మొదటి 5 దేశాలలో భారతదేశం ఒకటని.. 2070 నాటికి “నెట్ జీరో” సాధించాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నామని మోడీ తెలిపారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, CDRI, “లీడర్‌షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్”తో సహా భాగస్వామ్యం ద్వారా తమ భాగస్వామస్య దేశాలతో కలిసి పని చేస్తూనే ఉన్నామన్నారు. 🌍🌱🤝

🇮🇳 భారతదేశం ఒక పెద్ద వైవిధ్య దేశమని.. జీవవైవిధ్య పరిరక్షణ, రక్షణ, పునరుద్ధరణ, సుసంపన్నతపై చర్యలు తీసుకోవడంలో దేశం నిలకడగా ముందంజలో ఉందని మోడీ పేర్కొన్నారు. “గాంధీనగర్ ఇంప్లిమెంటేషన్ రోడ్‌మ్యాప్ – ప్లాట్‌ఫారమ్” ద్వారా అడవుల్లో మంటలు, మైనింగ్ కారణంగా ప్రభావితమైన ప్రాధాన్యతా ప్రకృతి దృశ్యాలలో పునరుద్ధరణను గుర్తిస్తున్నందుకు సంతోషిస్తున్నానతి తెలిపారు. మన గ్రహంలోని ఏడు పెద్ద పులి జాతుల సంరక్షణ కోసం భారతదేశం ఇటీవల “ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్” ప్రారంభించిందన్నారు. ఇది ప్రాజెక్ట్ టైగర్ నుంచి ఒక మార్గదర్శక పరిరక్షణ చొరవ అని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ టైగర్ ఫలితంగా నేడు ప్రపంచంలోని 70% పులులు భారతదేశంలోనే ఉన్నాయి.. ప్రాజెక్ట్ లయన్ – ప్రాజెక్ట్ డాల్ఫిన్ కోసం కూడా పని చేస్తున్నామమని మోడీ పేర్కొన్నారు. 🌳🐅👍


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page