top of page

🌸🌟👩‍💼 మహిళలకు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్.. 🌸🌟👩‍💼

🌸🌟 మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ అదిరిపోయే గిఫ్ట్‌ను ప్రకటించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల జీవితాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 🌟🌍

ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే.? ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రూ. 100 మేరకు తగ్గింపు ప్రకటించారు. 🌐 ఈ నిర్ణయం సామాన్య మహిళల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా కోట్లాది కుటుంబాల ఆర్ధిక భారాన్ని కూడా తగ్గిస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. 🌈 ఈ చర్య పర్యావరణ పరిరక్షణను కాపాడటమే కాకుండా.. ప్రతీ కుటుంబం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. 🌺🌱

🌟🔥 మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీం అర్హులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. రూ. 300 సబ్సిడీ మొత్తాన్ని మరో ఏడాది పాటు అందించనున్నట్టు వెల్లడించింది. 2025 మార్చి 31 వరకు ఈ సబ్సిడీ వర్తించనుందని పేర్కొంది. 🎉 కాగా, ఉజ్వల స్కీం అర్హులకు ఇంతకముందు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 200 ఉండగా.. ఆ మొత్తాన్ని గత ఏడాది అక్టోబర్ నుంచి రూ. 300గా పెంచుతున్నట్టు మోదీ సర్కార్ ప్రకటించిన సంగతి విదితమే. 💡🌏


bottom of page