top of page

చంద్రయాన్ 3 పై ప్రకాష్ రాజ్ సెటైర్లు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విధానాలపై తరచూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించే నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు అందుకుంటోంది. మరోవైపు.. ఇదే ఘటనపై తాజాగా ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు అయింది.ట్విటర్‌లో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. బ్రేకింగ్ న్యూస్ చంద్రునిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ కార్టూన్‌లో ఓ వ్య‌క్తి లుంగి క‌ట్టుకుని.. టీ పోస్తున్న‌ట్లు ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించకుండానే.. ఆయననే ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశానికే ప్రతిష్ఠ తెచ్చిన చంద్ర‌యాన్‌ 3 ప్ర‌యోగాన్ని ఉద్దేశించి రాజకీయంగా విమ‌ర్శించ‌డం ప్రకాశ్ రాజ్‌కు స‌రికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ట్వీట్ వైరల్ కావడం తన పై ట్రోలింగ్ తీవ్రం కావడంతో తర్వాత ప్రకాష్ రాజ్ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుందని.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని మరో ట్వీట్ చేశారు. అది అర్థం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎలా అని.. తాను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశానని.. మీరు ఏ చాయ్‌వాలా అనుకుంటున్నారో అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. దీంతో ఇది మరింత వివాదంగా మారింది.

Comments


bottom of page