top of page
Suresh D

ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..✨🎵


రెబల్ స్టార్ ప్రభాస్  వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. గతేడాది సలార్   చిత్రం తో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో, తదుపరి కల్కి 2898 AD   చిత్రం లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ది రాజా సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నేడు ఈ చిత్రం షూటింగ్ లో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ జాయిన్ అయ్యింది.

కొద్దిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో ఆమె పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన మ్యూజికల్ పోస్ట్ కి డైరెక్టర్ మారుతీ రెస్పాండ్ అవ్వడం తో మరింత క్లారిటీ వచ్చింది. త్వరలో ఫస్ట్ సింగిల్ కి సంబందించిన డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్  కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్  మరొక ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.✨🎵


bottom of page