top of page
MediaFx

ప్రభాస్ గొప్ప మనసు.. తెలుగు దర్శకుల కోసం భారీ సాయం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి మూవీతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ మూవీస్ కోసం సౌత్, నార్త్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. హీరోగానే కాకుండా డార్లింగ్ మంచి మనసు గురించి అందరికి తెలిసిందే. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. ఎప్పుడూ మౌనంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటారు. ఇక కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుంటారు. తన సినిమా షూటింగ్ సె‏ట్లో ఉన్నవాళ్లకు ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం తెప్పిస్తాడని ఇదివరకు చాలా మంది నటీనటులు చెప్పారు. అలాగే తన తోటి ఇతర భాష నటీనటులకు తెలుగింటి రుచులను రుచి చూపిస్తాడు. భోజనం విషయంలోనే కాకుండా యంగ్ హీరోలకు అండగా ఉంటాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు ప్రభాస్.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న ప్రతి ఏడాది డైరెక్టర్స్ డేగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సినీ ప్రముఖులకు, అగ్ర హీరోలకు.. నటీనటులకు పంపినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఈ వేడుకకు ప్రభాస్ ను సైతం ఆహ్వానించగా.. వస్తానని మాట ఇవ్వడంతోపాటు.. ఈ కార్యక్రమానికి రూ. 35 లక్షల విరాళాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ కు అందించారట. ఈ విషయాన్ని తెలుగు సినిమా దర్శకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడుంబా శంకర్ దర్శకుడు వీర శంకర్ తెలిపారు.దీంతో ప్రభాస్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Comments


bottom of page