top of page

అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి ఆదిపురుష్.? కారణం ఇదేనా

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. అలాగే ఈ సినిమా కథ కూడా రామాయణానికి భిన్నంగా ఉండటంతో ఈ మూవీ పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఈ సినిమా పై విమర్శలు మొదలయ్యాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని విమర్శలు వచ్చాయి. హిందూ సంఘాలు ఈ సినిమా పై కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయని తెలుస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ మూవీకి భారీ ఓపినింగ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాగా జులై చివరి వారంలో ఆదిపురుష్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. థియేటర్స్ లో రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గిపోవడంతో మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీ అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వస్తుండనై తెలుస్తోంది. ముందుగా ఆదిపురుష్ సినిమాను జులై చివరి వారంలో లేదా ఆగస్టు లు రిలీజ్ చేయాలని చూశారు. కానీ ఇప్పుడు అనుకున్నదానికంటే ముందుగానే ఆదిపురుష్ ఓటీటీలో రానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే పైరసీ రూపంలో బయటకు వచ్చింది ఈ మూవీ. తమిళ్ వర్షన్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. దాంతో ఈ సినిమాను త్వరగా ఓటీటీలో వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆదిపురుష్ ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ రానుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page