top of page

‘జిత్నీ అబాది, ఉత్నా హక్’ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చురకలు..

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన “జిత్నీ అబాదీ ఉత్నా హక్” వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం చురకలంటించారు. మైనారిటీ వర్గాల హక్కులను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా.. అని ప్రశ్నించారు ప్రధాని మోదీ.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన “జిత్నీ అబాదీ ఉత్నా హక్” వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం చురకలంటించారు. మైనారిటీ వర్గాల హక్కులను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా.. అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. “నిన్నటి నుంచి కాంగ్రెస్ నేతలు ‘జిత్నీ అబాది ఉత్నా హక్’ అంటున్నారు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ఎద్దేవ చేశారు.

దేశంలోని వనరులపై మైనారిటీలకే మొదటి హక్కు అని ఆయన చెప్పేవారు.. కానీ ఇప్పుడు దేశంలోని వనరులపై ఎవరికి మొదటి హక్కు ఉంటుందో ఆ వర్గాల జనాభా నిర్ణయిస్తుందని కాంగ్రెస్ చెబుతోందని ప్రధాని మోదీ అన్నారు. “కాబట్టి ఇప్పుడు వారు (కాంగ్రెస్) మైనారిటీ హక్కులను తగ్గించాలనుకుంటున్నారా? వారు మైనారిటీలను తొలగించాలనుకుంటున్నారా?… కాబట్టి, అత్యధిక జనాభా ఉన్న హిందువులు ముందుకు వచ్చి వారి అన్ని హక్కులను తీసుకోవాలా?.. నేను పునరావృతం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని ఇకపై కాంగ్రెస్ వారు నడుపుతున్నారు.కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నోరు మూసుకుని కూర్చున్నారు.. ఇదంతా చూసి అడగలేదు. మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను అవుట్‌సోర్సింగ్‌కు పంపారు”. ఎన్నికలకు వెళ్లనున్న ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ అన్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page