top of page

కామారెడ్డి మోదీ సభలో కీలక పరిణామం..

రైతుల కోసం బీఆర్ఎస్ ఏమీ చేయలేదని తమకు ఒక అవకాశం కల్పిస్తోందని రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. 🌾

దేశ వ్యాప్తంగా రైతులకు తక్కువ ధరలకే బస్తా ఎరువును అందిస్తున్న ప్రభుత్వం బీజేపీదని చెప్పారు. రైతుల కోసం ప్రత్యేకంగా కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు చేస్తోందని తెలిపారు. దీని ద్వారా కేవలం తెలంగాణలోనే 40లక్షల మంది రైతులు లబ్ధి పోందుతున్నట్లు చెప్పారు. 🌱 పాడి చేసుకొని బ్రతికే వారి కోసం పశువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ పథకం అమలు చేస్తోందన్నారు. 🐄 అలాగే నిరుద్యోగులకు ప్రతి ఏటా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 🌐 కేంద్రంలోని యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని కొత్తగా రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలోని అవకతవకలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన తరువాత సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరేంద్రమోదీకి తెలంగాణలోని బీజేపీ ముఖ్య నాయకులు ఒక చిత్రపటాన్ని బహూకరించారు. 🖼️ మోదీ గతంలో తన తల్లితో ముచ్చటిస్తున్న ఫోటోను పెయింటింగ్ రూపంలో తయారు చేసి ప్రత్యేకంగా అందజేశారు. 🎨 దీనిని చూస్తూ మోదీ ఆనందంతో పొంగిపోయారు. 😄

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page