top of page

🎉దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు 🪔

దీపావళి అంటే దీపాల పండుగ. హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన దీపావళిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఏడాది కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు మోడీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తిని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ‘వోకల్ ఫర్ లోకల్’ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దీపావళిని దేశంలోని భారతీయుల కోసం ప్రత్యేకంగా మార్చాలని ప్రధాని మోదీ అన్నారు.

అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ సందర్బంగా దేశ ప్రజలు అందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన వస్తువులను కొనడమే కాకుండా వాటితో సెల్ఫీ ఫోటోలు కూడా దిగాలని సూచించారు. ఆ ఫోటోలను నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు ప్రధాని. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా స్పందనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. 🇮🇳🪔🎉

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page