top of page
MediaFx

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం..


ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ పవన్‌ను ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అయితే ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకునేందుకు జనసేన సహా కూటమి కృష్టి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కోసం హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారానికి నడుం కట్టారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి ఓటు వేసి గెలిపించాలని వరుణ్ తేజ్ పిఠాపురంలో శనివారం ప్రచారం చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ విషయాన్ని నాగబాబు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్లు తెలుస్తుంది. కానీ పోలింగ్ దగ్గర పడే కొద్ది మరికొంతమంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. మరి ఇది ఎంతవరకూ అవుతుందో చూడాలి.


bottom of page