top of page
Suresh D

మాటనిలబెట్టుకున పల్లవి ప్రశాంత్..!✨

తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు.

తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ ను చాలా మంది ట్రోల్ చేశారు.ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రైతులకు తాను అందిస్తానన్న సాయంఅందించాడు. తాజాగా ప్రశాంత్ గజ్వేల్‪‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న  ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం అందించాడు.✨


bottom of page