పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరోసారి వివాదంలో నిలిచింది. T20 ప్రపంచకప్ 2024 కోసం అమెరికా వెళ్లిన బాబర్ ఆజామ్ సేన అక్కడ "మీట్ అండ్ గ్రీట్" పేరుతో ప్రైవేట్ డిన్నర్ను ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో పాల్గొనేందుకు 25 అమెరికన్ డాలర్ల ఎంట్రీ రుసుము వసూలు చేశారు. ఈ చర్యపై మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ తీవ్రంగా స్పందించారు.
సోషల్ మీడియాలో లతీఫ్ షేర్ చేసిన వీడియో ప్రకారం, 25 డాలర్ల రుసుము చెల్లించిన అభిమానులు డిన్నర్ సమయంలో పాక్ ఆటగాళ్లను కలిసే అవకాశం పొందారు. ఈ చర్య పాకిస్తాన్ క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఓ టీవీ షోలో లతీఫ్ దీని పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
“అధికారిక విందులు ఉంటాయి కానీ ఇది ప్రైవేట్ డిన్నర్. ఎవరు ఇలా చేయగలరు? ఇది భయంకరమైనది. $25కి మీరు మా ఆటగాళ్లను కలిశారు. అక్కడ గందరగోళం జరిగి ఉంటే ప్రజలు మా అబ్బాయిలు డబ్బు సంపాదిస్తున్నారని అనేవారు,” అని లతీఫ్ అన్నాడు.
లతీఫ్ స్వచ్చంద సంస్థల కోసం నిధుల సేకరణ కోసం విందులు నిర్వహించడాన్ని సమర్థించగా, రుసుముతో ప్రైవేట్ డిన్నర్ నిర్వహించడం తన ఊహకు మించినదని చెప్పాడు. పాక్ ఆటగాళ్లు డబ్బు కోసం ఎలాంటి అభ్యర్థనలనైనా అనడగరని ప్రజలు చెబుతున్నారని లతీఫ్ చెప్పాడు.
ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని లతీఫ్ సూచించాడు. స్వచ్చంద సంస్థల కోసం విందులు నిర్వహించడం ఓ అర్థం కలిగిన చర్య అయితే, పాకిస్తాన్ క్రికెట్ పేరుతో ప్రైవేట్ డిన్నర్ చేయడం తగదని హెచ్చరించాడు.