top of page

🚆 ఈ రూట్లో వందేభారత్‌ ఎక్కాలంటే.. ఒక రోజు ఆఫీస్ డుమ్మా కొట్టాల్సిందే..!

🛤️ కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య దూరం దాదాపు 610 కిమీ. 🚄 వందే భారత్ రైలులో ప్రయాణానికి 8.30 గంటలు పడుతుంది. 🛤️

ఏదైన అంతరాయం ఏర్పడితే..10 గంటలు కూడా పడుతుంది. 🕓 IT ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొత్తగా ప్రవేశపెట్టిన రైలు పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, దాని టైమింగ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 😔 🏙️ హైదరాబాద్‌ చిక్కడపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాట్లాడుతూ.. 🚄 వందేభారత్‌ రైలులో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిచడానికి తాము.. ఒకరోజు ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. 💼 🛣️ వందేభారత్‌ షెడ్యూల్‌ చాలా మంది ఉద్యోగులకు అనువైనదిగా లేదన్నారు. 👨‍💼 👪 అయితే, ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి ఇది సమస్య కాదని చెప్పారు. 🏡

🚆 ప్రస్తుతం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి, 🌃 మహబూబ్‌నగర్ (ఉదయం 6.49), 🏛️ కర్నూలు సిటీ (ఉదయం 8.24), 🏜️ అనంతపురం (ఉదయం 10.44), 🌆 ధర్మవరం (ఉదయం 11.14) మీదుగా యశ్వంతపూర్ జంక్షన్‌కు మధ్యాహ్నం 2.00 గంటలకు చేరుకుంటుంది. ⏰ అక్కడి నుండి ప్రజలు 🏢 వారి ఆఫీసు లేదా ఇంటికి చేరుకునే సమయం దాదాపు మరో రెండు గంటలు పట్టే అవకాశం ఉంది. 🕒

🌃 దీంతో సాయంత్రం అవుతుంది. అంటే, రోజంతా ప్రయాణానికే సరిపోతుంది. 👍 ఇక, తిరుగు ప్రయాణ సమయం కూడా ఇలాగే ఉంటుంది. 🌙 యశ్వంతపూర్‌ జంక్షన్‌ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి, 🌌 రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 🌠 బెంగళూరు ట్రాఫిక్‌ను అధిగమించి.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, 🌃 రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page