top of page

బ్రిటీషోల్లకు..చెమటలు పట్టించిన NTR ఫ్యాన్స్.

ఫ్యాన్స్ హంగామా హద్దులు దాటుతోంది. వారి సరదా.. సీరియస్ అయ్యే వరకు వెళుతోంది. చివరికి నవ్వులు పోయి నువ్వులు అన్న సామెతలా.. తయారవుతోంది. ఇక రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఓ పిచ్చి పని కూడా.. దేశం కానీ దేశంలో.. అందర్నీ హడలిపోయేలా చేసింది.

ఫ్యాన్స్ హంగామా హద్దులు దాటుతోంది. వారి సరదా.. సీరియస్ అయ్యే వరకు వెళుతోంది. చివరికి నవ్వులు పోయి నువ్వులు అన్న సామెతలా.. తయారవుతోంది. ఇక రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఓ పిచ్చి పని కూడా.. దేశం కానీ దేశంలో.. అందర్నీ హడలిపోయేలా చేసింది. బతుకు జీవుడా అంటూ అందర్నీ పరితెగ్గేలా చేసింది. ఎస్ ! టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా.. తాజాగా రిలీజ్ అయిన సింహాద్రి 4కె థియేటర్లో ఫ్యాన్స్ అత్యుత్సాహం అందర్నీ పరేషాన్ చేస్తోంది. ఇక యూకేలోని వెస్ట్ లండన్‌లోని ఓ థియేటర్లో … సింహాద్రి సినిమా చూస్తున్న ఫ్యాన్స్… థియేటర్లో నే క్రాకర్స్ అండ్ ఫాగ్ బాంబ్స్ కాల్చారు. దీంతో .. థియేటర్‌ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. నికి తోడు.. ఫాగ్‌ను గుర్తించిన ఫాగ్ డిటెక్టర్స్ ఫైల్ అలారమ్స్‌ను ఆక్టివేట్ చేయడంతో.. ఒక్క సారిగా.. థియేటర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంటలు అంటుకున్నాయనే అనుమానం .. థియేటర్లో సినిమా చూస్తున్న వారికి కలగడంతో.. అందరూ థియేటర్ బయటికి ఒక్క సారిగా పరిగెత్తారు. మరో పక్క బ్రిటీష్ అఫీసర్స్ కూడా ఈ విషయంలో హడలిపోయారు. అయితే మంటలు అంటుకోలేదని తెలియడంతో.. హమ్మయ్య అనుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page