గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి బ్యాక్డ్రాప్లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15 విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్లో పాల్గోటుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున్న మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ ఈవెంట్కు టాలీవుడ్ అగ్రకథానాయకులు ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాబోతున్నట్లు తెలుస్తుంది. తారక్ బావమరిది నార్నే నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించడం.. అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వీరిద్దరూ రాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వార్తపై అధికారికి ప్రకటన రావాల్సి ఉంది.
ఆగష్టు 15న ఆయ్ సినిమాతో పాటు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీనితో పాటు తమిళం నుంచి తంగలాన్ వస్తుంది.
Comments