top of page

మాల్దీవుల్లో తాగు నీటి కొరత

మాల్ధీవ్స్ తాగునీరు లేక అల్లాడుతోంది. నీటి కొరతను అధిగమించేందుకు టిబెట్‌లోని హిమనీ నదాల నుంచి చైనా 1500 టన్నుల తాగునీరును మాల్ధీవులకు సాయంగా అందించింది. భారత్‌తో ద్వైపాక్షిక వివాదం తర్వాత మాల్ధీవులకు అన్నివిధాలా సాయం చేస్తామని ఇప్పటికే చైనా ప్రకటించింది. ఇదిలా ఉంటే భారత్‌తో వివాదం పెట్టుకున్నప్పటి నుంచి మాల్దీవ్స్‌ను వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆ దేశం ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోయింది.

bottom of page