top of page
MediaFx

నివేదా పేతురాజ్ వాగ్వాదం వీడియో - అసలు కథేంటంటే?

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ ఇటీవల వెండితెరకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. చెన్నైకి చెందిన ఈ అందాల తార "మెంటల్ మదిలో" చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినా, గత రెండేళ్లుగా ఆమె తెలుగు సినిమాల్లో నటించకపోవడం గమనార్హం. కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి కంటెంట్ ఉంటే తప్ప చేయకూడదని డిసైడ్ అయ్యింది.

తాజాగా నివేదా పేతురాజ్ ఒక వీడియోతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ వీడియోలో, ఆమె కారు డిక్కీని చెక్ చేయాలని కోరిన పోలీసులతో వాగ్వాదం పడింది. తన కారు డిక్కీలో ఏమీలేవని, తన దగ్గర అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయని నివేదా అంటుంది. అయితే, పోలీసులు వినకుండా డిక్కీ తెరవాలని పట్టుబట్టారు.

ఇక ఆమె టెన్షన్ పడుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. వీడియోలో, పోలీస్ ఒకరు ఈ ఘటనను వీడియో తీస్తుండగా, నివేదా ఆ ఫోన్ ను లాగేసుకోవడం కూడా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు డిక్కీలో ఏముందో అని తెగ ఆసక్తిగా చర్చలు మొదలుపెట్టారు.

అసలు ఇది నిజమేనా అని మరికొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియకపోయినా, ఈ వీడియో నిజానికి నివేదా పేతురాజ్ కొత్త సినిమా ప్రమోషన్ లో భాగమని తేలింది. జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ కానున్న "పరువు" అనే వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం ఈ వీడియో విడుదలైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దీంతో అది నిజం కాదని తేలిపోయింది. "పరువు" ప్రాజెక్టు జూన్ 14న విడుదల కానున్న నేపధ్యంలో, ఈ పబ్లిసిటీ స్టంట్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాలని ప్రయత్నించారు.


bottom of page