top of page

విడాకులపై క్లారిటీ ఇచ్చిన నిహారిక .

మెగా డాటర్ నిహారిక విడాకుల పై వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోతున్నారు. 2020లో డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది.

బంధు మిత్రుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంట చాలా అన్యోన్యంగా కనిపించారు. వెకేషన్స్ కి వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అనుకునేలోగా ఊహించని షాక్ ఇచ్చారు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. తాజాగా ఈ జంట విడాకులకు దాఖలు చేశారు. కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక , చైతన్య విడాకులకు అప్లై చేశారు.కొంతకాలంగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో నిహారిక చైతన్య విడిపోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఫ్యామిలీ ఫంక్షన్స్ లోను ఈ ఇద్దరు కలిసి కనిపించక పోవడమతొ వీరు విడిపోతున్నారు అన్న వార్తలకు మరింత బలం చేకూరింది.ఇక ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోతున్నారన్న క్లారిటీ వచ్చేసింది. విడాకుల పై నిహారిక స్పందించారు. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం.. మాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ , ఫ్రెండ్స్ కు కృతజ్ఞతలు. దయచేసి మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అని తెలిపింది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page