top of page

‘మెగా’ సెంటిమెంటుపై నిహారిక ఆశలు..


మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక అమ్మాయి.. కొణిదెల నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన నిహారికకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. తమిళంలో ఆమె నటించిన ఓ చిత్రం కూడా సరిగా ఆడలేదు.

ఇలాంటి సమయంలో ఆమె తన అక్క సుశ్మిత బాటలోనే నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిహారిక ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం.. కమిటీ కుర్రాళ్ళు. అందరూ కొత్త వాళ్లను పెట్టి యాదు వంశీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 9న ‘కమిటీ కుర్రాళ్ళు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య బాగా పని చేస్తున్న ‘మెగా’ సెంటిమెంటు తనకు కూడా కలిసొచ్చి నిర్మాతగా విజయాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. “చరణ్ అన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వరకు వెళ్లింది. అక్కడ రెండు అవార్డులు కూడా సంపాదించింది. పెదనాన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. మా బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా మా మెగా ఫ్యామిలీకి ఈ మధ్య బాగా కలిసొస్తోంది. అదే బాటలో నేను కూడా నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్ళు’తో విజయాన్నందుకుంటాను” అని నిహారిక పేర్కొంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page