top of page
MediaFx

లీడ్ లోకి వచ్చిన మోదీ.. వారణాసిలో హోరాహోరీ

ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో హోరాహోరీ కొనసాగుతోంది. ఓ దశలో ప్రధాని మోదీ వెనుకబడ్డారు. తాజాగా ఆయన మళ్లీ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లో వెనుకబడ్డ మోదీ.. మూడో రౌండ్ కు వచ్చేసరికి పుంజుకున్నారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా 619 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ప్రధాని మోదీకి ఇప్పటి వరకు పోలైన ఓట్లు 36,424 కాగా, ఆయన ప్రత్యర్థి అజయ్ రాయ్ కి 35,805 ఓట్లు పోలయ్యాయి. ఆధిక్యం స్వల్పంగానే ఉండడంతో బీజేపీ వర్గాల్లో ఆందోళన నెలకొనగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

bottom of page