top of page

🚆 ఢిల్లీ-మీరట్‌ మధ్య పట్టాలెక్కెన నమోభారత్‌ రైళ్లు.. జెండా ఊపి రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ 🛤

📆 న్యూఢిల్లీ/ఘజియాబాద్, అక్టోబర్ 20: దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలు (నమో భారత్)ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 🚄

ఈ సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరి కూడా పాల్గొన్నారు. 🚅 మొదటి దశలో సిద్ధం చేసిన 17 కి.మి కారిడార్ సాహిబాబాద్ నుంచి దుహై వరకు పనిచేస్తుంది. 🌄 ఇది నమో భారత్‌గా పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి రాపిడ్‌ఎక్స్ రైలు ఇదే. 🚈

📍 ఘజియాబాద్‌లోని వసుంధర సెక్టార్‌-8లో నిర్మించిన స్టేషన్‌ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 'నమో భారత్‌'ను జెండా ఊపి ప్రారంభించారు. 🌆 శనివారం నుంచి సామాన్య ప్రజల కోసం ర్యాపిడ్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. 🕑 మొదటి దశలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 🚉

🚻 పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం కలిగిన నమో భారత్ రైళ్లలో ఇరువైపులా 2×2 లేఅవుట్లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్ ర్యాక్లు ఉంటాయి. 🧳 సీసీటీవీలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ వ్యవస్థ, ఛార్జింగ్ పాయింట్లు వంటి అధునాతన సౌకర్యాలు కల్పించారు. 🎒 ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు ఉంటుంది. 🌇

🚄 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) NCRలో ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) యొక్క నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది, ఇది ఢిల్లీ మెట్రో యొక్క వివిధ మార్గాలతో అనుసంధానించబడుతుంది. 🌟 ఇది అల్వార్, పానిపట్ మరియు మీరట్ వంటి నగరాలను ఢిల్లీకి కలుపుతుంది. 🌆🚈

ความคิดเห็น


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page