top of page

నాగార్జున సాగర్‌ను సందర్శించిన హీరోయిన్ లయ..


స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లయ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రలోనే కనిపించిన లయకు ఫ్యామిలీ అడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది లయ. ఇందులో ప్రేమించు సినిమాకు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకుంది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 40 సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ అక్కడే సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు.తాజాగా లయ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జు సాగర్ ను సందర్శించింది. నాగార్జున సాగర్ నుండి మాచర్ల వెళ్ళే మార్గం లో నూతన వంతెన పై నుంచి ఫొటోలు దిగారు.

లయ ను చూడటానికి అభిమానులు, అక్కడికి వచ్చిన పర్యాటకులు భారీ గా తరలి వచ్చారు. ప్రస్తుతం లయ నాగార్జున సాగర్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page