ముంబయి ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 1) సొంత గడ్డపై రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆ జట్టుకు చుక్కెదురైంది.
ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలై, ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటములను మూట గట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్య (34), తిలక్ వర్మ (32) పరుగులు చేశారు. యుజువేంద్ర చాహల్, బౌల్డ్ తలో మూడు వికెట్లు తీయగా, బర్జర్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రియాన్ పరాగ్ (54) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబయికి ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, రాజస్థాన్కు హ్యాట్రిక్ విజయం. ఆకాశ్ మధ్వాల్ (20/3) చెలరేగినా, తక్కువ స్కోరు కావడంతో ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో హార్దిక్ సేనుకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా, రాజస్థాన్ కు హ్యాట్రిక్ గెలుపు.🏏