top of page

అంబటి రాయుడి అసలు కథ..

అటు ఫీల్డ్ లోను ఇటు నిజ జీవితంలోను దూకుడుగా ఉండే క్రికెటర్ అంబటి రాయుడు. ఇటీవల తాను IPL లో నుంచి కూడా రిటైర్ అయిన విషయం తెలిసిందే. 2019 లో తనను ప్రపంచ కప్పుకు సెలెక్ట్ చెయ్యలేదని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు రాయుడు.

రాయుడు ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే ప్రశ్నకు అప్పటి సెలెక్టర్ ఎం.స్ .కె ప్రసాద్ “విజయ్ శంకర్ ఐతే 3 డైమెన్షనల్ ప్లేయర్ , బ్యాటింగ్ ,బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ చేయగలడు “ అని సమాధానం ఇచ్చాడు. దానికి దీటుగా రాయుడు “అయితే నేను 3D గ్లాసెస్ కొనుక్కొని అతని ఆటను చూస్తాను అని బదులిచ్చాడు. ఈ కాంట్రవర్సీ ముగిసిన 3 ఏళ్లకు , ఇటీవల జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో రాయుడు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. విజయ్ శంకర్ మీద తనకు ఎటువంటి కోపం లేదని , తనని సెలెక్ట్ చేయకపోవటం సెలెక్టర్ల తప్పే కానీ విజయ్ శంకర్ ది కాదని చెప్పాడు. అలాగే తనకు మొదటినుంచి బోర్డు లో ఉన్న ఇద్దరి ముగ్గిరితో విభేదాలు ఉన్నట్టు కూడా అంగీకరించాడు. తానూ హైదరాబాద్ టీం వదిలి ఏపీ క్రికెట్ టీం కి ఆడేటప్పుడు తనకు అప్పటి బోర్డు మెంబెర్ ఎం.స్ .కె ప్రసాద్ నిర్ణయాలు అంత నచ్చేవి కాదని అన్నాడు . అందువల్ల అతను తిరిగి హైదరాబాద్ టీం లో జాయిన్ అయ్యానని చెప్పాడు రాయుడు. తానూ అంటే ఇష్టం లేనివాళ్లే పాలిటిక్స్ చేసి తనను టీం లో లేకుండా చేశారని వాపోయాడు


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page