దేశవ్యాప్తంగా జరిగిన 543 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్ సభకు ఎన్నికైన ఎంపీలకు ప్రభుత్వం నుంచి అందే జీతం, ఇతరత్రా ప్రయోజనాలు ఏమిటంటే:
జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
జీతం: నెలకు ₹1 లక్ష
నియోజకవర్గ ఖర్చులు: నెలకు ₹70 వేలు
ఆఫీస్ నిర్వహణ: నెలకు ₹60 వేలు
పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే డీఏ: రోజుకు ₹2 వేలు
విమాన ప్రయాణం: ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి 34 సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు
రైలులో ఫస్ట్ క్లాస్ ప్రయాణం: వ్యక్తిగత, అధికారిక పనులకు
నియోజకవర్గంలో పర్యటించినపుడు టీఏ: క్లెయిమ్ చేసుకోవచ్చు
ఉచిత వసతి సౌకర్యం: పదవీకాలం పూర్తయ్యే వరకు.. లేదా వసతి కోసం నెలకు ₹2 లక్షలు
ఉచిత వైద్య సదుపాయం: ఎంపీ కుటుంబానికి
పెన్షన్: పదవీకాలం పూర్తయ్యాక నెలకు ₹25 వేలు, ఒక్కసారి కంటే ఎక్కువ పర్యాయాలు ఎంపీగా సేవలందిస్తే, పింఛన్ ఏటా ₹2 వేల చొప్పున పెంపు
ఉచిత ఫోన్ కాల్స్: ఏటా 1.5 లక్షల కాల్స్ చేసుకోవచ్చు
హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు విద్యుత్: 50 వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవచ్చు