top of page

🇮🇳🚩ప్రధాని మోడీ రాజస్థాన్‌ పర్యటన🚶‍♂️🌄

👨‍💼 ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం (జులై 27) రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. 🏞️🚶‍♂️

గత కొన్ని రోజులుగా బీజేపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. 🗣️🏛️

ముఖ్యంగా మణిపూర్‌ హింస నేపథ్యంలో ఆయన కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 🤬🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 అదే సమయంలో రాజస్థాన్‌ లాంటి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ మంత్రులు గెహ్లాట్‌పై విరుచుకుపడుతున్నారు. 🤯🔥 ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం (జులై 27) రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. 🏞️🚶‍♂️ వివిధ అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 🏗️💼 కాగా ఈ పర్యటన షెడ్యూల్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ ప్రసంగాన్ని తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. 🗣️💬 దీనిపై అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రధాని మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ పెట్టారు. 🙏🐦 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాజస్థాన్‌ రానున్నారు. మీ పీఎంవో కార్యాలయం ముందుగా షెడ్యూల్‌ చేసిన నా 3 నిమిషాల ప్రసంగాన్ని తొలగించింది. కాబట్టి ఇలా ట్విట్టర్‌ ద్వారానే రాజస్థాన్‌కు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను' అని రాసుకొచ్చారు గెహ్లాట్‌. 💐🐦

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page