top of page

గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్‏లో సినిమా చూడొచ్చు..

కొన్ని రోజులుగా థియేటర్లలో సందడి తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ ఈ వారం మాత్రం వరుసగా మూడు చిత్రాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి: "గం గం గణేశా," "భజే వాయు వేగం," "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి." సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రకటన ప్రకారం, సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తోంది.

ఈ ప్రత్యేక ఆఫర్ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలీస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, మూవీ మ్యాక్స్ సహా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్ లలో అందుబాటులో ఉంటుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందానీ చెప్పారు. 90 శాతం సీట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని, దక్షిణాదిలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఈ సదుపాయం ఉందని చెప్పారు. కొన్ని థియేటర్లలో రూ.70 కంటే తక్కువ ధరకే టికెట్స్ కొనుగోలు చేయొచ్చన్నారు.

ఈ ఆఫర్ ద్వారా ఎక్కువ మంది సినీ ప్రియులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గతంలో 2022లో జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించగా, అప్పట్లో 65 లక్షల మంది సినిమాలను చూశారు. ఈ రోజు మాత్రమే "మిస్టర్ అండ్ మిసెస్ మహి," "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి," "గం గం గణేశా," "భజే వాయు వేగం" సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

bottom of page