top of page

🇮🇳 వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో మోదీ సమావేశం..

🌐 దేశంలో సంపూర్ణ ఆరోగ్యం అందించడం మరో అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ఎమ్మార్పీ ధరలపై 70 నుంచి 80 శాతం రాయితీతో మెడిసిన్ అందుబాటులో ఉంచారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న జన్ ఔషధీ కేంద్రాల సంఖ్యను పెంచబోతున్నారు. ఇప్పుడు 10వేల కేంద్రాలు అందుబాటులో ఉంటే వాటికి అదనంగా 15వేల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో జన్ ఔషధీ కేంద్రాల సంఖ్య 25వేలు కానుంది. ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాని చేసిన వాగ్థానాలను నెరవేర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 🚀 వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే.. 🌾 గ్రామీణ ప్రాంతాల్లో అనగా ముఖ్యంగా తాండాల్లో నివసించే ఆదివాసీలకు లబ్ధితో పాటూ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించనున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోనున్నారు. 2023 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆదివాసీ గౌరవ్ దివస్ నాడు ప్రారంభమైన ఈ యాత్ర వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం వరకు కొనసాగనుంది. 🇮🇳


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page