top of page

అనుష్క మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఆకట్టుకుంది ఈ సినిమా. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత భాగమతి అనే సినిమాలో నటించింది. ఆతర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. ఇక ఈ అమ్మడు చేసిన అరుంధతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఆకట్టుకుంది ఈ సినిమా. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత భాగమతి అనే సినిమాలో నటించింది. ఆతర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా.. అనుష్క చెఫ్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. తన కామెడీ టైమింగ్ తో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ఇక ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page