top of page
Suresh D

వారిపై మంత్రి సీతక్క శాపనార్థాలు..

తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఫైర్ బ్రాండ్‌గా, పాపులర్ మహిళ నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపున్న మంత్రి సీతక్క ఒకసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. కోపంతో ఊగిపోతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై శాపనార్థాలు పెట్టారు. కలమశం తెలియని తనపై విమర్శలు చేస్తే నాశనం అయిపోతారని ఆగ్రహంతో హెచ్చరించారు. సీతక్క ఆగ్రహానికి అసలు కారణం ఇదే… సోషల్ మీడియాలో ఎక్కడ ఏం జరిగినా సీతక్కకు అంట కడుతూ విష ప్రచారాలు చేస్తున్నారట. ఎవరో చేసిన తప్పులను తనకు అంటకట్టి వ్యూస్ కోసం విష ప్రచారాలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట.సొంత ఛానళ్ళు, యూట్యూబ్ లు పెట్టుకుని వ్యూస్ కోసం తన పై బురద జల్లతే నాశనం అవుతారని హెచ్చరించారు. ఇస్టానుసారంగా దుష్ప్రచారం చేసినవాళ్ళు బాగుపడి, బట్టకట్టరని ద్వజమెత్తారు.

bottom of page