top of page
Shiva YT

🌐వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు🗳️

🗳️ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 🌐 జగన్ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 📣

తాజాగా వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 🚌 సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల్లా కొందరు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. 🌍 అయితే స్థానికత లేని అలాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరని వ్యాఖ్యానించారు. 🛑 తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీలోకి షర్మిల వచ్చారన్నారు. 🗳️ ఏపీలో కాంగ్రెస్‌లోకి ఎవరువచ్చినా జీరోలే అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 🌟 జగనన్న కు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయన్నారు. 👍 వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు ఉంటారని వ్యాఖ్యానించారు.

👑 జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని.. 📈 గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. 🌆 విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. 🌄 రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించే విషయంలో జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. 🗣️ ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్‌కి లేదన్నారు. 🤝 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు. 🚪 ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూంలో కూచుని రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. 🗳️

bottom of page