తాజాగా తెలంగాణ సచివాలయంలో ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా తెలంగాణ సచివాలయంలో ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్రాజ్ తప్ప ఎవరూ కనీసం విషెస్ చెప్పలేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ఇండస్ట్రీపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాత దిల్రాజు తప్ప సినిమా వాళ్లు ఎవరూ తనకు ఫోన్ చేయలేదు అని అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి, వారం రోజుల్లో సినీ ఇండస్ట్రీపై నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించాను అని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. ఇదిలా ఉంటే దిల్రాజ్ అమెరికా పర్యటనలో ఉండటంతో… మంత్రిని కలిసేందుకు వెళ్లలేదని సినీవర్గ ప్రముఖులు అంటున్నారు. దిల్రాజ్ తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత అంతా కలిసి మంత్రిని కలవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.🎞️🎥
Comments