top of page
MediaFx

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం 🎉

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. నా సామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోన్న చిరంజీవికి ఒక అరుదైన గౌరవం లభించింది. సినిమా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా దుబాయ్‌ ప్రభుత్వం చిరంజీవికి గోల్డెన్‌ వీసాను అందించింది. ఈ వీసాతో దుబాయ్ లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసముండొచ్చు. 2019 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందిస్తోంది.

చిరంజీవి కంటే ముందు ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదెల, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ సినీ పరిశ్రమలకు చెందిన రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, జాహ్నవి కపూర్, రణవీర్ సింగ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మౌని రాయ్, మోహన్ లాల్ తదితరులు కూడా గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసుకు సంబంధించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినిమా సీనియర్ జర్నలిస్టు ప్రభుకు ఆయన ఉచితంగా వైద్యం చేయించారట. గుండె సమస్యలతో బాధపడుతోన్న ఆయనను స్టార్ హాస్పిటల్ లో చేర్పించి, ఖర్చు లేకుండా స్టంట్ వేయించారట. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ మంచి తనానికి ఇది మరో నిదర్శనమంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు షేర్ చేస్తున్నారు.

bottom of page