top of page

మెగాస్టార్ చిరంజీవి పాట‌కు.. పీవీ సింధు స్టెప్పులు


పీవీ సింధు ఆటల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్.. రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. అప్పుడప్పుడు తనకు నచ్చిన పాటలపై స్టెప్పులేస్తూ డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది. తాజాగా పీవీ సింధు మెగాస్టార్ చిరంజీవి పాట‌కు స్టెప్పులేసింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోని బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ అనే పాట ఎంత హిట్టయ్యిందో అంద‌రికి తెలిసిందే. తాజాగా ఈ పాట‌కు పీవీ సింధు డ్యాన్స్ చేసింది. బ్లూ క‌ల‌ర్ లెహంగా డ్రెస్స్‌లో స్టైలిష్‌గా ఉన్న సింధు ఈ పాట‌కు స్టెప్పులేసి మ‌రింత అందం తీసుకొచ్చింది. డ్యాన్స్ వీడియోను సింధు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇది వైర‌ల్‌గా మారింది. షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 332,968 లక్షల మంది ఈ వీడియోను ఇష్టప‌డ‌గా. . వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. గాయం నుంచి కోలుకున్న సింధు ప్ర‌స్తుతం బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ ఛాంపియ‌న్‌షిప్స్‌లో అడుతుంది. ఈ టోర్నీలో భార‌త్ యూఏఈ, మ‌లేసియా, క‌జ‌కిస్తాన్ ల‌తో క‌లిసి గ్రూప్-బిలో ఉంది.




Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page