top of page

ఓడితే నా శవం చూస్తారు


ఏపీ ఎన్నికల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓట్లు వేయమని ప్రచారం చేస్తున్న అభ్యర్దులు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అభ్యర్ది కందుల నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అధినేత సమక్షంలోనే ఎన్నికల్లో పొరపాటు జరిగితే తన శవం చూస్తారంటూ వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ అభ్యర్ది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తన గెలుపు మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. ఈ సారి మార్కాపురం ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఏదైనా పొరబాటు జరిగితే మార్కాపురం ప్రజలు తన శవం చూడల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు సైతం షాక్ అయ్యారు. కానీ, ఎక్కడా స్పందించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ప్రచారం చేస్తున్నారు. 


bottom of page