top of page

గుండెపోటుతో ఎయిర్ పోర్టులో కుప్పకూలిపోయిన వ్యక్తి.. కాపాడిన జవాన్లు..


వివరాల్లోకి వెళ్తే.. అర్షిద్ అయూబ్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. టెర్మినల్ 2 వద్ద లగేజీతో నిల్చనున్నాడు. అయితే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది వెంటనే ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి పరిశీలించారు. గుండె పోటు అని గమనించిన సిబ్బంది.. వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించారు. అనంతరం మెరుగైన చికిత్స్ కోసం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. గుండె పోటుకు గురైన వ్యక్తి శ్రీనగర్ వెళ్లేందుకు వచ్చాడని సీఐఎస్ఎఫ్ అధికార ప్రతిని తెలిపారు. హ్యాండ్ ట్రాలీ స్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోవంతో.. అక్కడున్న ఇద్దరు జవాన్లు రక్షించినట్లు చెప్పారు. వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టగలిగారని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. సీఐఎస్ఎఫ్ జవాన్లపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page