top of page

📜 ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టో రాబోతుంది... 💬 మంత్రి హరీష్ రావు

🏞️ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 🏥 ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 🗣️

60 ఏళ్ల కాంగ్రెస్. టీడీపీ పాలనలో రాజకీయ నాయకుల డ్రామాలు తప్ప ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చుక్క నీళ్లు రాలేదని హరీష్ రావు అన్నారు. 💧 కల్వకుర్తికి నీళ్లు తీసుకురావడం బీఆర్ఎల్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. 🚰 అలాగే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వీడినటువంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. 🗳️ అలాగే రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చింది 2వేల రూపాయల ఆసరా పెన్షన్ సహా అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిందని.. 💰 అలాగే కల్వకుర్తిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నాపు. 💦 ట్రాన్స్‌ఫార్మర్ కాలకుండా, ఒక్క పంటైన కాంగ్రెస్ హయంలో పండిందా అంటూ ప్రశ్నించారు.

👉 ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. 🤔 అయితే కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతులకు రైతు బీమా ప్రభుత్వం అమలవుతుందా అని ప్రశ్నించారు. 🌾 అలాగే కేసీఆర్ పాలనలో పల్లె దావాఖన, బస్తీ దవాఖాన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టి వైద్యం అందరికీ అందేలా చేశారని అన్నారు. 🏨 అలాగే త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కానుందని.. 📢 అన్ని వర్గాలు సంతోషించే విధంగా ఈ మేనిఫెస్టో ఉండనుందని చెప్పారు. 📣👏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page