top of page

సైబర్ పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ టీమ్‌..

గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలో రిలీజైంది. ఇందులో లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి మహేశ్‌ మరదలి పాత్రలో మెప్పించింది. సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోన్న గుంటూరు కారం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వరుసగా సంక్రాంతి సెలవులు ఉండడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు మేకర్స్‌. అయితే గుంటూరు కారం సినిమాపై కొందరు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారని చిత్ర బృందం ఆరోపిస్తోంది. ఇదే విషయమై వారు సైబర పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ థియేటర్‌ బుకింగ్‌ యాప్‌ బుక్‌ మై షోలో మహేశ్‌ బాబు సినిమాకు తక్కువ రేటింగ్ రావడం, అలాగే కేవలం 70 వేల ఓట్లే పడడంపై ఆరా తీయాలని సైబర్‌ పోలీసులను కోరినట్లు సమాచారం. ఫేక్‌ ఓటింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page