top of page

‘మనసుకు నచ్చినవారితో ప్రతిక్షణం ఆస్వాదించడం’.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్..

🌟 సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‍గా ఉంటారు. నిత్యం తన సినిమా అప్డేట్స్, ఫ్యామిలీ విషయాలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంటారు.

అంతేకాకుంటా చాలాసార్లు తన గారాలపట్టి సితారకు సంబంధించిన డాన్స్ వీడియోలను నెట్టింట అభిమానలతో కలిసి షేర్ చేసుకుంటారు. సినిమాల నుంచి కాస్త బ్రేక్ దొరికితే కుటుంబంతో కలిసి గడిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు మహేష్. ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా విదేశాలకు వెకేషన్స్ వెళ్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు మహేష్. “ప్రతిక్షణం వారితో ఆస్వాదించడం చాలా ఆనందంగా ఉంటుంది.” అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ మహేష్ బాబును అంతగా సంతోషాన్ని కలిగించే వ్యక్తులు ఎవరా అనుకుంటున్నారా ?.. ఇంకేవరు తన ఫ్యామిలీయే. 👨‍👩‍👧‍👦 ఇదిలా ఉంటే.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు మహేష్. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తోన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన దమ్ మసాలా మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. 🎬🕺


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page