top of page

మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాడు అదృశ్యం

మహబూబ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఒక ఉపాధ్యాయుడు శంషాబాద్ లో గల్లంతయ్యాడు.

పోలీస్ లు తెలిపిన కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లో నివాసం ఉంటున్న జి. రాఘవేంద్ర రావు మహబూబ్ నగర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు.

ఈ నెల 3 న మహబూబ్ నగర్ నుంచి కార్ లో కుటుంబసభ్యులతో హైదరాబాద్ బయల్దేరాడు. శంషాబాద్ మునిసిపల్ కేంద్రం సమీపంలో రాత్రి 9 గంటలకు కార్ ను రహదారి పక్కన ఆపి మంచినీళ్లు తీసుకొస్తా అని వెళ్ళాడు . బార్యా పిల్లలు రెండు గంటల పాటు ఎదురుచూసినా రాఘవేంద్ర రాకపోవటం తో , వాళ్ళు మరో వాహనంలో నాదర్ గుల్ కి బయల్దేరారు. వాళ్ళు వెళ్లిన తర్వాత కార్ ను రాఘవేంద్ర తీస్కెళ్లినట్టు సీసీ టీవీ లో రికార్డు అయింది . అయితే తనకు ఇంటి నిర్మాణంలో అయిన అప్పు వళ్ళ చాలా ఒత్తిడి ఉందని ఇంతకుముందు పలుమార్లు ఇలాగె చేశాడని , అందుకే తిరిగి వస్తాడు అనుకోని లేట్ గా ఫిర్యాదు చేశామని అయన భార్య చెప్పారు. పోలిసుల దర్యాప్తు మేరకు బంజారాహిల్స్ లోని ఒక ఎటిఎం లో అతను నగదు డ్రా చేసినట్లు వెల్లడైంది . పోలీస్ లు హైదరాబాద్ లో గాలింపు చెర్యలు చేపట్టారు


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page