top of page
Suresh D

యువతను ఆకర్షించే పనిలో ప్రధాన పార్టీలు..!🗳️✨

తెలంగాణలో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 90 లక్షల మంది యువ ఓటర్లు రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో 18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు 9 లక్షల మంది, 19-35 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లు దాదాపు 81 లక్షల మంది ఉన్నారు. గత 100 రోజుల్లో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. వేలాది ఖాళీల భర్తీకి గ్రూప్ -1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేశామని, జూన్ లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరో 50 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చింది.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రిక్రూట్ మెంట్ డ్రైవ్ లు చేపట్టడంలో విఫలమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి తోడు 2022లో టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఇతర నియామక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం, పరీక్షల రద్దు బీఆర్ఎస్ పై ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో యువత కీలక పాత్ర పోషించారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, యూపీఎస్సీ తరహాలో 2025 నుంచి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన లాంటి హామీలతో కాంగ్రెస్ యువ ఓటర్ల మద్దతును పొందింది. ఇక బీజేపీ కూడా మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని, మొత్తం 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ‘యువరోషిణి’ కార్యక్రమం కింద స్టార్టప్ లకు రూ.5,000 కోట్ల కార్పస్ ను కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి కసరత్తులు చేస్తోంది. జాబ్ క్యాలెండర్, ఇతర నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉండటంతో ప్రధాన పార్టీలు యూత్ ను ఆకర్షిస్తున్నాయి.🗳️

Commentaires


bottom of page