top of page

🇮🇳🇮🇱🚨 ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి.. భారతీయ పౌరులకు హెచ్చరికలు చేసిన ఎంబసీ 🚨🇮🇱

తమ దేశంపై దాడికి దిగినటువంటి హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ దీటుగా ఎదుర్కొంటోంది. 🔫 దీనివల్ల ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 🇮🇳🇮🇱

అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్నటువంటి భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. 🏢 ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. 🚫 ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. 👁️🚷 అలాగే స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని పేర్కొంది. 📜 ముఖ్యంగా అనవసరంగా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెప్పింది. 🏠 అలాగే సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండండని తెలిపింది. 🏕️ అత్యవసర పరిస్థితులు తలెత్తినట్లైతే వెంటనే ఎంబసీ సిబ్బందిని సంప్రదించాలని టెల్‌ అవివ్‌లోని భారత దౌత్యకార్యాలయం తమ అడ్వైజరీలో ఈ కీలక విషయాలను జారీ చేసింది. 🤝🌏🇮🇳🇮🇱

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page